గాంధీనగర్ : వచ్చే ఐదేళ్లలో గుజరాత్లో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదాని గ్రూపు ఛైర్మన్ గౌతం అదాని వెల్లడించారు. 2025 నాటికి రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల్లో రూ.55 వేల కోట్ల వ్యయం చేయనున్నామన్నారు. ప్రధాని మోడి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడమే కాకుండా.. ఆచరణలోనూ తీర్చిదిద్దారన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్థి చెందిన దేశంగా అవతరించబోతోందన్నారు. గుజరాత్ కచ్ జిల్లాలోని ఖావ్డాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన పార్కును నిర్మిస్తున్నట్లు అదాని తెలిపారు.