ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నిబంధనలకు విరుద్ధంగా బిల్లు లేకుండా నగదు, బంగారం తరలిస్తే చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్సై ఎం.సత్యనారాయణ రాజు అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో శుక్రవారం నరసాపురం రైల్వే స్టేషన్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశాయి. శుక్రవారం ఉదయం నరసాపురం రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ హుబ్లీ నుండి వచ్చిన ట్రైన్ లోని ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. నరసాపురం పట్టణ, ఆర్ పి ఎఫ్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.