విలేకర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి 

Dec 22,2023 17:38 #Kurnool
action against attack on reporter

ప్రజాశక్తి-గూడూరు : ఆస్పరి మండలంలో పనిచేస్తున్న ఆంధ్రజ్యోతి విలేఖరి శివ కేశవులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజే తాసిల్దార్ కు వెంకట రమణయ్య కు వినత పత్రం అందజేశారు. ఏపీడబ్ల్యూజే మండల అధ్యక్షుడు ఉరుకుందు మాట్లాడుతూ వైసిపి పార్టీకి చెందిన జడ్పిటిసి విరుపాక్షి ఫ్లెక్సీలను అదే పార్టీకి చెందిన గుమ్మనూరు జయరాం వర్గీయులు చించుతుండగా విలేఖరి ఫోటోలు దింపుతున్న సమయంలో అతని సెల్ ఫోను లాక్కోవడం దురుసు మాటలతో మాట్లాడి బెదిరించారని అటువంటి వారిని వెంటనే శిక్షించి అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తదిత విలేకరులు పాల్గొన్నారు.

➡️