ప్రజాశక్తి – అచ్యుతాపురం (అనకాపల్లి) : బైక్ను లారీ ఢకొీనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో గురు వారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దుక్కుతూరుకు చెందిన గొల్లపల్లి శేఖర్ (19), జంగుళూరుకు చెందిన దూది జ్యోతి ప్రకాష్ (14) స్నేహితులు. వారిద్దరూ ఎస్టిబిఎల్ సినిమా హాలు వద్ద జ్యూస్ పార్లర్ నడుపుతున్న దుక్కుతూరుకు చెందిన నర్మాల అమల (38) వద్ద జ్యూస్ తాగేందుకు వచ్చారు. అనంతరం వారు బైకుపై బయలుదేరుతుండగా అచ్యుతాపురంలోని అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లాలని, అక్కడి వరకూ తనను తీసుకెళ్లాలని అమల కోరారు. దీంతో ముగ్గురూ కలిసి బైకుపై బయలుదేరారు. ఎన్టిపిసి నుంచి రాజమండ్రికి ఫ్లయాష్ బూడిదను తరలిస్తున్న లారీ అచ్యుతాపురం వద్ద వీరి బైకును ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. ప్రమాద విషయం తెలిసిన మృతుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని అచ్యుతాపురం – యలమంచిలి రోడ్డుపై బైఠాయించారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామనిసిఐ ఎం.బుచ్చిరాజు, ఎస్ఐ నారాయణరావు తెలపడంతో వారు ఆందోళన విరమించారు.