మ్యాక్స్‌ 500 స్టోర్లకు చేరిక

Feb 19,2024 21:12 #Business

పూణె : ప్రముఖ ఫ్యాషన్‌ ఉత్పత్తుల రిటైలర్‌ మ్యాక్స్‌ భారత్‌లో 500 స్టోర్లకు విస్తరించినట్లు ప్రకటించింది. ఈ స్టోర్‌ను పూణెలో తెరవడంతో నూతన మైలురాయికి చేరినట్లు పేర్కొంది. భారత్‌లో తాము 2006లో ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. నాలుగు కోట్ల కుటుంబాలను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మ్యాక్స్‌ ఫ్యాషన్‌ ప్రెసిడెంట్‌, డిప్యూటీ సిఇఒ సుమిత్‌ చంద్నా పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా 50 పైగా స్టోర్లను తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

➡️