ప్రజాశక్తి-నరసాపుర (పశ్చిమ గోదావరి జిల్లా) : మండలంలోని సీతారాంపురంలో ఉన్న కళాశాల వద్ద సిఎస్సిఈ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎస్.ఉమామహేశ్వరరావు ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టర్ డిగ్రీ పొందారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి పిహెచ్డి గైడ్ గా వ్యవహరించారు. ఉమామహేశ్వరరావు సిఎస్సిఈ డిపార్ట్మెంట్ వద్ద బిగ్ డేటా క్లాసిఫికేషన్ అనే పరిశోధన అంశంపై డాక్టర్ డిగ్రీ పొందారు. డాక్టర్ పొందిన ఎస్.ఉమామహేశ్వరరావు కళాశాల చైర్మన్ కెవి.సత్యనారాయణ, ట్రెజరీ కె.వి స్వామి, డైరెక్టర్ ఏ శ్రీహరి, ప్రిన్సిపల్ ఎస్.సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ ఏ.గోపీచంద్, ప్రిన్సిపల్ డాక్టర్ పండరినాథ్, సిఎస్ఈహెచ్ఓడి పి.శ్రీనివాస్ అభినందించారు.