గుండె పోటుతో ఏఎస్ఐ మృతి

Mar 18,2024 10:52 #Annamayya district

ప్రజాశక్తి-బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లిలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రెడ్డెప్పనాయక్ ఆదివారం రాత్రి సుమారు 11.56 గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. ఏఎస్ఐ పిటీఎం మండలం, చండ్రాయునిపల్లి సరిహద్దు చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తుండగా గుండె నొప్పి రావడంతో వెంటనే సహచరులు ఏఎస్ఐని 108 వాహణంలో బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన ఆస్పత్రిలోని డాక్టర్లు మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఏఎస్ఐ మరణ వార్తతో జిల్లాలోని పోలీసులు విచారం వ్యక్తం చేశారు. నీతి, నిజాయితీగా పని చేసే పోలీస్ ఆఫీసరుగా మదనపల్లి, తంబళ్లపల్లి, ముదివేడు తదితరాల్లో ఏఎస్ఐగా పని చేస్తూ పేరు తెచ్చుకున్న రెడ్డెప్ప నాయక్ మరణ వార్త పలువురిని కంటతడి పెట్టిస్తోంది. గుండెపోటుతో మృతి చెందిన ఏఎస్ఐ రెడ్డప్ప నాయక్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

➡️