మక్కువ: మండలంలోని శంబర, ఎస్ పెద్దవలస పంచాయతీ పరిధిలోని అన్ని చెరువు పనుల వద్ద సోమవారం మస్తర్లను ఎపిఒ ఈశ్వరమ్మ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలతో పనిచేసే విధానంపై ఆమె ముచ్చటించారు. సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వ విధానం ప్రకారం వేతనం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.