ప్రజాశక్తి-రేణిగుంట : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్స్లర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొనటానికి తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి గురువారం ఉదయం చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీ శ, ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసి ప్రొ.భారతి, డీన్ సుధ, జెసి శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కమీషనర్ అదితి సింగ్ తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి బయల్దేరి వెళ్లారు.