అమరావతి : కఠిన ఉపావస దీక్షల విరమణ రోజు జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలుగాలని ఆకాంక్షించారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ మత సామరస్యానికి, సుహృద్భావానికి , సర్వమానవ సమత్వానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలువాలని కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు అతిపెద్ద పండుగ రంజాన్లో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలపై అల్లా కరుణ ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనంద, ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని వేడుకున్నారు.