న్యూఢిల్లీ : చండీగఢ్ మేయర్గా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఎన్నికైనట్లు సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. దీంతో మేయర్ ఎన్నిక విషయంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదం నేటితో ముగిసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమారే చట్టబద్ధమైన విజేత అని నిర్థారించింది. గతంలో రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫలితాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రిటర్నింగ్ అధికారి అనీల్ మనీష్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు అనీల్ మనీష్కి షోకాజ్ నోటీసు జారీచేసింది.
కేజ్రీవాల్ హర్షం
చండీగఢ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని అన్నారు.