న్యాయవాది ఆంజనేయులుకు సన్మానం

Jan 19,2024 23:42

ప్రజాశక్తి – చీరాల
కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడుగా చీరాలకు చెందిన న్యాయవాది నన్నెబొయిన ఆంజనేయులు ఎన్నికయిన సందర్భంగా స్థానిక కోర్ట్ ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ బార్ అసోసియేషన్‌లో సభ్యుడైన నన్నెబొయిన ఆంజనేయులు కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడుగా ఎన్నికవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరెన్నో గొప్ప విజయాలు సాధించాలని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్‌లోని న్యాయవాదులు కర్నేటి రవి, బండ్లమూడి విజయ్ కుమార్, జెవిఎస్ కుమార్, పున్నయ్య పాల్గొన్నారు.

➡️