కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రత్యేక హోదా

Apr 6,2024 15:30 #West Godavari District

ప్రజాశక్తి-కాళ్ళ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. మండలంలోని కాళ్లకూరు, దొడ్డనపూడి, కాళ్ళ,కోమటిగుంట, సీసలి, జక్కరం, పెదఅమిరం, వేంపాడు, కోపల్లె గ్రామాల్లో శనివారం పర్యటించారు. మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసి తమకు మద్దతు తెలపాలని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రత్యేక మోదా, విభజన హామీలు కానీ, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సంస్థలు మొదలైన ఎలాంటి హామీలనూ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు వైసిపి, టిడిపి కేంద్రం నుంచి ఏమీ సాధించలేకపోయారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారెంటీలను ఇచ్చిందని, వాటిలో ప్రధానమైనది ప్రత్యేక హోదా అన్నారు. ఈ ప్రచారంలో పీసిసి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి  సోడదాసి గంగయ్య, ఆకివీడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతా ఆదిశేషు, కాళ్ళ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లి సత్య శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నేతలు బొర్రా పార్థు తదితరులు పాల్గొన్నారు.

➡️