అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న దంపతులు ఆదివారం మృతి చెందారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు ఎస్సీ కాలనీలో బాలకోటయ్య, ఈశ్వరమ్మ దంపతులు నివశిస్తున్నారు. ఈనెల 18న గ్యాస్ పొయ్యి పాడవడంతో టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి.ఈ ప్రమాదంలో ఈశ్వరమ్మకు మంటలంటుకొని 80 శాతం శరీరం కాలిపోయింది. పక్కనే ఉన్న టెక్నీషియన్తో పాటు భర్త బాలకోటయ్యకు గాయలయ్యాయి. దంపతుల కుమారుడు శ్రీనుకు స్వల్ప గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ దంపతులను హుటాహుటినా ఒంగోలు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ దంపతులిద్దరూ ఆదివారం మృతి చెందడంతో ఎస్సీకాలనీలో విషాదఛాయలు నెలకొని ఉన్నాయి.