గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : గుర్తు తెలియని వాహనం ఢకొీని వ్యక్తి మృతి చెందిన సంఘటన పీలేరులో చోటు చేసుకుంది. శనివారం ఉదయం పోలీసుల వివరాల మేరకు …. స్థానిక కామాటంపల్లికి చెందిన జి.శ్రీరాములు (71) తన ఇంటి నుంచి పాత బస్టాండుకు నడుచుకుంటూ వెళుతుండగా పట్టణంలోని మదనపల్లి రోడ్డులో ఉన్న బోదేషావలి దర్గా వద్ద గుర్తు తెలియని వాహనం ఢ కొని తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని వారి బంధువులు ఆటోలో పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవ పంచనామా కోసం శవపరీక్ష గదికి తరలించారు.

➡️