గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
ప్రజాశక్తి-కపిలేశ్వరపురం
ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగర పిహెచ్సిలో శనివారం వైద్యాధికారులు డాక్టర్ పిఎన్ఎస్డి.రత్నకుమారి, డా. జివి.గీతాంజలి ఆధ్వర్యంలో మండపేట గైనకాలజిస్ట్ డా.కన్యాకుమారి 73 మంది గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వారిలో హైరిస్క్ గర్భిణులను 15 మందిని గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు, లేబరేటరీ పరీక్షలు జరిపి వారికి మందులను అందజేశారు. డా.కె.కన్యా కుమారి మాట్లాడుతూ గర్భిణులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. అనంతరం గర్భిణులు ఆరోగ్యం పట్ల పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు, తీసుకోవలసిన పౌష్టికాహారం, ఆసుపత్రిలో ప్రసవాల ప్రాముఖ్యత, ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను హెల్త్ ఎడ్యుకేటర్ బి.రామారావు, ఎంపిహెచ్ఇఓ జె.మల్లికా ర్జునుడు వివరించారు. వైద్య పరీక్షలకు హాజరైన గర్భిణులకు అంగరకు చెందిన బలుసు రుద్ర మూర్తి ఏర్పాటు చేసిన పలు రకాల పండ్లు, బ్రెడ్స్, బిస్కెట్ అందజేశారు. కార్యక్రమంలో ఎడ్యుకేటెడ్ బి.రామారావు, ఎఎన్ఎంలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణులు పాల్గొన్నారు.