విజయవాడ : విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం’ ఆరో రోజు పాదయాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్ పాత గిరిపురంలో మంగళవారం కొనసాగుతోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు నేతఅత్వంలో ఇంటింటికి ప్రచారంగా ఈ పాదయాత్ర కొనసాగుతోంది. ” దేశాన్ని ముంచిన రాష్ట్రాన్ని వంచించిన బిజెపి-వైసిపిలను గద్దె దించండి.. నిరంకుశ బిజెపితో జతకడుతున్న తెలుగుదేశం కూటమిని ఓడించండి.. నీతివంతమైన రాజకీయాలతో దేశ ఐక్యతకు, ప్రజలకు అండగా నిలిచే సిపిఎం, వామపక్షాలను బలపరచండి..” నినాదంతో గత ఐదు రోజులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం ‘జన శంఖారావం’ పాదయాత్ర కొనసాగుతోంది.