విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు
ప్రజాశక్తి-రామచంద్రపురం
ద్రాక్షారామలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 534 మంది విద్యార్థులకు గురువారం ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ద్రాక్షారామ భీమేశ్వర దంతవైద్యశాల వైద్యులు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం, దంతాల సంరక్షణకు అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. 40 మంది విద్యార్థులకు దంత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్వి.నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ శంకర్, సూపరింటెండెంట్ బి.రాజశేఖర్, గురుకుల పాఠశాల వైద్యులుఎం.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.