ప్రజాశక్తి-మన్యం : రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శనివారంతో నాలుగో రోజుకు చేరింది. ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర సందర్భంగా … జగన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేస్తానన్న హామీని అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 4 నెలల పెండింగ్ వేతనాలు తక్షణం చెల్లించాలని, పీఎఫ్, ఈ.ఎస్.ఐ అమలుచేయాలని ఉద్యోగులంతా నినాదాలు చేశారు. మన్యంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులంతా నల్లటి రిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.