47 మందికి కరాటే బెల్టు గ్రేడింగ్‌ పరీక్షలు

Feb 18,2024 20:50

ప్రజాశక్తి- లక్కవరపుకోట : మండల కేంద్రంలో ఉన్న శ్రీచైతన్య ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో విక్టరీ షుటోకాన్‌ కరాటే అసోసియేషన్‌ డు ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ శిక్షకులు రాజు మాస్టర్‌ ఆధ్వర్యంలో ఆదివారం కరాటే బెల్ట్‌ గ్రేడింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో వివిధ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 47 మంది విద్యార్థులు పాల్గొ న్నారు. వీరిలో 39 మంది పసుపు రంగు బెల్టులు సాధించుకోగా ఆరెంజ్‌ బెల్టు నలుగురు, గ్రీన్‌ బెల్ట్‌ ఇద్దరు గెలుపొందారు. పద్మనాభ మండలం కొత్త కొవ్వాడలో ఉన్న సంస్కృతి ఇంగ్లీష్‌ మీడియం పాఠశా లలో 5,6 తరగతులు చదువుతున్న జశ్విత, లోసికలు బ్రౌన్‌ బెల్ట్‌లు సంపాదించారు. స్వామివివేకానంద ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల నుండి ఆరుగురు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు లక్కవరపుకోట హెడ్‌ కానిస్టేబుల్‌ పాపారావు, ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ సంగం హారిక ధ్రువీకరణ పత్రాలు బహుకరించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️