లానేస్తం చెక్కును అందిస్తున్న అధికారులు
పుట్టపర్తి అర్బన్ : కొత్తగా లాగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువ లాయర్లు వత్తిలో నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్ లానేస్తం ద్వారా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య పేర్కొన్నారు. సోమవారం నాడు కలెక్టరేట్లో వైఎస్ఆర్ లా నేస్తం పథకం ద్వారా అర్హులైన జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయాన్ని 37 మందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అర్హులైన 37 మంది యువ న్యాయవాదులకు రెండవ విడతలో భాగంగా తొలిసారి ఒక్కొక్కరికి 5000 చొప్పున యువ న్యాయవాదుల ఖాతాల్లో జమ చేశారన్నారు. అర్హులైన యువ న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చారని వారికి ఆర్థిక సహాయ పత్రాలను అందజేస్తున్నామన్నారు. గ్రామ వార్డు సచివాలయాల కోఆర్డినేటర్ శివారెడ్డితో కలిసి డిఆర్ఒ లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయం పత్రాలను అందజేశారు. ఈ పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు పాల్గొన్నారు.