లారీ,బస్సు ఢీ.. 30 మందికి గాయాలు

Mar 2,2024 16:42 #road acident, #Tirupati district

ప్రజాశక్తి-పెళ్లకూరు(తిరుపతి) :పెళ్లకూరు మండలంలోని చవట కండ్రిగ గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరికి కాలు చేయి విరగడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పెళ్లకూరు మండల ఎస్సై శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. నాయుడుపేట వైపు నుండి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును శ్రీకాళహస్తి వైపు నుండి నాయుడుపేట వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.

➡️