ప్రజాశక్తి-విజయవాడ :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సతీష్ను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 27 వరకు సతీష్ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిఎం జగన్పై దాడి కేసులో ఎ-1గా ఉన్న సతీష్ను న్యాయవాది సమక్షంలోనే విచారించాలని.. నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని ఆదేశించింది. నిందితుడిని విచారించిన అంశాలను కోర్టు ముందుంచాలని తెలిపింది.