ప్రజాశక్తి- దత్తిరాజేరు : మానాపురం రైల్వేగేటు వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రెండో శనివారం సెలవు కావడంతో సంక్రాంతికి కాస్త ముందుగానే పల్లెలకు అంతా బయల్దేరడం, మరోవైపు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో వాహనాలన్నీ రైల్వే గేటుకు ఇరువైపులా బారులు తీరాయి. సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది.