ఆర్‌టిసి ఉద్యోగులకు 21 రోజుల సెలవులు

Jan 1,2024 20:08 #ap government, #APSRTC

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులకు 2024లో 21 సాధారణ సెలవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి పిఎస్‌ ప్రద్యుమ్న సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1న నూతన సంవత్సరాది, 15న సంక్రాంతి, 16న కనుమ, 26న రిపబ్లిక్‌ డే, అలాగే మార్చి నెలలో 8న మహాశివరాత్రి, 29న గుడ్‌ ఫ్రైడే, ఏప్రిల్‌ 9న ఉగాది, 11న రంజాన్‌, 17న శ్రీరామనవమి, జూన్‌ 17న బక్రీద్‌, జులై 17న మొహర్రం, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, 26న శ్రీకృష్ణాష్టమి, సెప్టెంబరు 7న వినాయక చవితి, 16న మిలాడనబి, అక్టోబరు 2న గాంధీ జయంతి, 11న దుర్గాష్టమి, 12న విజయదశమి, 31న దీపావళి, నవంబరు 5న నాగులచవితి, డిసెంబరు 25న క్రిస్మస్‌ సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

➡️