ద్రాక్షారామలో జ్యోతిరావు పూలే 197వ జయంతి

Apr 11,2024 11:40 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : భారతీయ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని ద్రాక్షారామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం మైనార్టీ బీసీ సంఘం నాయకులు యాట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ద్రాక్షారామ మసీద్ సెంటర్ లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కులవ్యవస్తకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ స్థాపించి, తన భార్య సావిత్రీ బాయి పూలేతో ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్ధులకు విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను అవరోదించిన మహనీయులు పూలే దంపతులు అని వక్తలుకొని ఆడారు. అంబేడ్కర్ జయంతి, మహాత్మా గాంధీ జయంతి వలే పూలే జయంతి రోజున కూడా ప్రభుత్వం శెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కలిదిండి వెంకట సుబ్బారావు, కొసన కామేశ్వరరావు, మేడిశెట్టి శ్రీనివాస్, యాట్ల రోజా రాణి, కాటే సంజీవి, కాటే కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️