క్యాంపస్ సెలక్షనన్స్ లో 18 మంది ఎంపిక

Apr 10,2024 15:31 #Bapatla District

ప్రజాశక్తి-వేటపాలెం : సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాలలో ఇటీవల నిర్వహించిన ఒయాసిస్ ఆటోమేషన్ టెక్నాలజీస్” వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 18 మంది విద్యార్ధులు ఎంపికైనట్లు కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘ఒయాసిస్ ఆటోమేషన్ టెక్నాలజీస్, వారు క్యాంపస్ సెలక్షన్స్ కళాశాలలో బి.టెక్ (ఇ.ఇ.ఇ. ఇ.సి.ఇ బ్రాంచిలలో ) 2024 విద్యా సంవత్సరంలో పూర్తి చేయబోయే విద్యార్థులకు 2023 లలో పూర్తి చేసిన కళాశాల విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ కళాశాలలోని రిక్రూట్మెంట్ ఫెసిలిటినందు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఎంపికలకు 70 మంది ఆన్లైన్ పరీక్షకు హాజరు కాగా అందులో 30మంది ఇంటర్వూకు అర్హత సాధించారు. అందులో 18 మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె. జగదీష్ బాబు తెలియజేశారు. బి.టెక్ విద్యార్థులు ఇ.సి.ఇ బ్రాంచి విద్యార్థులు 15 మంది ఇ.ఇ.ఇ బ్రాంచి విద్యార్ధులు ముగ్గురు ఎంపికైనట్లు తెలిపారు. బి.టెక్ విద్యార్థులకు నెలకు రు. 18,000/- వేతనము ఇతర అలివేలు ఉంటాయన్నారు

➡️