Nov 29,2023 21:47
మాట్లాడుతున్న జనసేన నాయకులు

మాట్లాడుతున్న జనసేన నాయకులు
బంగారు రాజాఇప్పుడే జ్ఞానోదయం అయిందా..
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:ఓటిపి లతో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుంది అని వాలంటీర్ల విషయంలో మా అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ పలుమార్లు ఉచ్చరిస్తే దానికి గందరగోళం చేశారు మీ వైసిపి నాయకులు.ఇప్పటికి జ్ఞానోదయం అయింది మీకు… ఇప్పటికే ఓటీపీల ద్వారా వ్యక్తిగత సమాచారం తో కొంతమంది వాలంటీర్లు చేసిన చేతివటానికి బాధ్యులెవరు..? వారికి ఏ శిక్షలు విధిస్తారు..? తెలిపి తర్వాత ఎలక్షన్ల తర్వాత టిడిపి వాళ్లు చేసే ఓటీపీల దుర్వినియోగం గురించి ఆలోచించండి..జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి, డిసిప్లినరీ కమిటీ హెడ్‌, సిటీ నిర్దేశకులు వేములపాటి అజరు సూచనలతో…బుధవారం సత్యనారాయణపురం, నెల్లూరు సిటీ, ఐదవ డివిజన్లో జనసేన నాయకులు పార్టీ పతాకావిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నెల్లూరు సిటీలో జనసేన పార్టీ మద్దతు దారులు గాని పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను అధికసంఖ్యలో ఉన్నారు.క్రియాశీలక సభ్యత్వంలో కూడా దాదాపుగా 1500 దాటింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన మార్కు చూపే విధంగా చిరంజీవి యువత సీనియర్‌ నాయకులు జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు అందరూ కలిసి జనసేన పార్టీ ఆశయాలను పవన్‌ కళ్యాణ్‌ సిద్ధాంతాలను ప్రతిగడపకు చేర వేసే విధంగా సిటీ నిర్దేశకులు వేములపాటి అజరు ఆధ్వర్యంలో పనిచేస్తాం.నెల్లూరు సిటీ లోని పలు ముఖ్య కూడళ్లలో జనసేన పార్టీ జెండాలను స్థాపించి ప్రజా ప్రభుత్వం స్థాపిస్తే జనసేన పార్టీ తరఫున ప్రజలకు మేలు జరుగుతుందనే విషయాన్ని అందరికి తెలియజేసే విధంగా త్వరలో కరపత్రాలతో ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చేస్తాం.ఓటీపీలు ఇవ్వడం వ్యక్తిగత సమాచారం దోపిడీకి గురవుతుందని పలుమార్లు పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించిన పట్టించుకోకపోగా ప్రతిపక్షాలు ఓటిపిలు గూర్చి రాద్ధాంతం చేస్తున్న సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ వైసిపీ నాయకులకి వర్తించేట్లులేదు.వైసిపి నాయకులకు ఒక చట్టం ప్రతిపక్షాలకు,ప్రజలకు ఒక చట్టం లా ఉంది.ప్రస్తుతం వాలంటీర్లు 42 పేజీల జగన్‌ పుస్తక ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఖజానాతో వైసిపి ఫ్రీ ప్రచారం సాగుతుంది.ఈ నాలుగు సంవత్సరాల వైసిపి దౌర్జన్యాలను, దోపిడీలను,బాధలను అర్థం చేసుకొని బంగారు భవితకై పని చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఈసారి అవకాశం ఇచ్చి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలందరూ సహకరించాల్సిందిగా పిలుపునిచ్చారు.రానున్న రోజుల్లో మా నాయకులు నాగబాబు,నాదెళ్ల మనోహర్‌ , సిటీ నిర్దేశికులు అజరు ఆధ్వర్యంలో జనసేన పార్టీని ఒక బలమైన శక్తిగా తయారు చేస్తామన్నారు.కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్‌తో పాటు జనసేన సీనియర్‌ నాయకులు, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరి రవికుమార్‌, ó కష్ణారెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, ఈగి సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️