112 మంది వైద్యులపై వేటుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం..!

Feb 28,2024 14:26 #medical college doctors, #terminet

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది వైద్యులపై వేటు వేసేందుకు తెలంగాణ సర్కార్‌ సిద్ధమైంది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. నెలలుగా డుమ్మా కొడుతున్న వైద్యుల లిస్ట్‌ను తెలంగాణ ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. ఉద్యోగాల్లో ఉండి.. కాలేజీలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఉన్న డాక్టర్లను విధుల నుంచి తొలిగించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వైద్యులు గైర్హాజరు కావడం కారణంగా అటు వైద్య విద్యార్థులకు తరగతులు జరగకపోగా.. ఇటు అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో టీచింగ్‌ హాస్పిటల్స్‌ కావడంతో రోగులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. దవాఖానల్లో ఓపీ తక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆథారైసెడ్‌ అబెసెన్సీలో ఉన్న 112 మంది వైద్యులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. వీరిని సర్వీస్‌ నుంచి టర్మినేట్‌ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వీరి స్థానంలో కాంట్రాక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వేసేందుకు కూడా అధికారులు కసరత్తు ముమ్మరం చేసినట్టు సమాచారం.

➡️