పెంచలకోన జలపాతం వద్ద గల్లంతైన 11 మంది సేఫ్‌

Nov 30,2023 10:54 #Nellore District

ప్రజాశక్తి-నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వున్న జలపాతంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన 11 మంది పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని రోప్‌ల సాయంతో రక్షించారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో జలపాతంలో ఉదృతి పెరిగింది. దీంతో జలపాతం అందాలను వీక్షించేందుకు వెళ్లిన అయ్యప్పస్వాములు అక్కడే చిక్కుకుపోయారు. అనంతరం వీరిని రక్షించిన పోలీసులు స్వస్థలాలకు పంపారు.

➡️