ప్రజాశక్తి-ఎస్ఆర్పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై 108 వాహనం ఆగింది. మంగళవారం అటువైపుగా వెళ్తున్న ప్రజాశక్తి.. పైలెట్ని పలకరించగా ఇంజిన్ సమస్య వలన రోడ్డుపై ఆగిపోయింది. జిల్లాస్థాయి అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. ఇలా 108 వాహనంలో పేషెంట్తో వెళ్తుంటే రోడ్డుపై ఇలా ఆగిపోతే మరి ఏంటి పరిస్థితి..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చికిత్స చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని హితువు పలికారు.