ప్రజాశక్తి – గొల్లప్రోలు(పిఠాపురం)
108 అంబులెన్స్లో ఒక మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామనికి చెందిన కె అచ్చుతా చక్రమ్మకు పురిటి నొప్పులు రావడంతో 108కి ఫోన్ చేశారు. గొల్లప్రోలుకు చెందిన అంబులెన్స్ వేరే కేసు పనిలో ఉండడంతో పిఠాపురం నుంచి వెళ్లినట్టు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పి.వరప్రసాద్, పైలట్ కృష్ణంరాజు తెలిపారు. దుర్గాడ నుంచి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తుంటే మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్లోనే ప్రసవం చేశామని, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని, మెరుగైన వైద్యం కోసం పిఠాపురం ప్రభుత్వ తరలించినట్లు సిబ్బంది తెలిపారు.