‘ఆనందం’ సినిమాతో ఇండిస్టీకి పరిచయమైన జై ఆకాశ్ హీరోగా ఓ తమిళ సినిమా తెరకెక్కింది. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మామరం’. ఇందులో బ్రహ్మానందం, కాదల్ సుకుమార్, రాహుల్దేవ్ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఇది తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రమని ఆకాష్ ఇటీవల నిర్వహించిన ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో చెప్పారు. ఈ చిత్రాన్ని గత 2012లో ప్రారంభించి 10 ఏళ్లుగా షూటింగ్ నిర్వహించినట్లు కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కథ డిమాండ్ కారణంగా ఇన్నేళ్లు షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆకాష్ పాత్ర 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు మూడు కోణాల్లో సాగుతుంది. దీంతో రియాలిటీ కోసం 10 ఏళ్లు దశల వారీగా షూటింగ్ నిర్వహించినట్లు ఆకాష్ వివరించారు.