భీమడోలు ఎంపిడిఒగా స్వర్ణలత బాధ్యతలు

ప్రజాశక్తి – భీమడోలు

మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగా టి.స్వర్ణలత సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇంతవరకు ఇన్‌ఛార్జి ఎంపిడిఒగా పనిచేసిన అన్నపూర్ణ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. ఎన్నికల నేపథ్యంలో భీమడోలు ఎంపిడిఒగా పనిచేసిన చాగంటి పద్మావతి దేవి కృష్ణా జిల్లా ముసునూరుకు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో కృష్ణా జిల్లా పామర్రు ఎంపిడిఒగా పనిచేస్తున్న టి.స్వర్ణలత భీమడోలు బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్వర్ణలతను కార్యాలయ అధికారులు, సిబ్బందితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.

➡️