షేక్ మస్తాన్ బి భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు
సత్తెనపల్లి రూరల్: సత్తెనపల్లి మండలం ఫణిదం సిపిఎం సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ సా భార్య, పార్టీ సానుభూతి పరురాలు షేక్ మస్తాన్ బి అనారోగ్య కారణంతో మృతి చెందారు.. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ ఆమె భౌతిక కాయాన్ని ఆదివారం సందర్శించి నివాళులర్పించారు విజరుకుమార్ మాట్లాడుతూ గ్రామంలో మహిళా సం ఘం నిర్మాణంలో మస్తాన్ బి ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. మహిళలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా గ్రామంలో మహిళలను ఐక్యం చేశారని, అనేక కూలి పోరాటాల్లో కూడా పాల్గొన్నారని అన్నారు. మస్తాన్ బి భర్త షేక్ హుస్సేన్ సా గ్రామ పార్టీ సభ్యుల్లో ప్రముఖులని, భార్యాభర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డారని అన్నారు. మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు గద్దె ఉమశ్రీ మాట్లాడుతూ షేక్ మస్తాన్ బి మహిళా సంఘంలో చాలా చురుగ్గా పనిచేసేవారని, గ్రామంలో సంఘ నిర్మా ణానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పెండ్యాల మహేష్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని, సిఐటియు సత్తెనపల్లి పట్టణ కార్యదర్శి హరి పోతురాజు, గ్రామ పార్టీ నాయకులు ఆర్.పూర్ణచంద్రరావు, కె.వెంకటేశ్వర్లు, గ్రామ పార్టీ శాఖ కార్యదర్శి వి.తులసీరామ్ పాల్గొన్నారు.