నెల్లూరు జిల్లాలో లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి

Jan 7,2024 10:23 #Nellore District, #road accident

ప్రజాశక్తి-గుడ్లూరు: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆదివారం తెల్లవారుజామున తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. క్షతగాత్రులను తొలుత కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. వీరిలో సీతమ్మ (65) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. టీఎస్‌ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️