నాయీబ్రాహ్మణులకు ప్రాధాన్యత : లక్ష్మి

ప్రజాశక్తి-దర్శి టిడిపి అధికారంలోకి వస్తే దేవాలయాల పాలక వర్గంలో నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించన్నటు టిడిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి నగర పంచాయతీలోని గడియార స్తంభం సెంటర్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణులను కలసి వారితో మాట్లాడారు. టిడిపితోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమన్యాయం జరుగుతుందన్నారు. వైసిపిలో పేదలందరికీ అన్యాయం జరిగిందన్నారు. అనంతరం మండల పరిధిలోని రామచంద్రపురం, కొత్తవెంక టాపురం, తూర్పు వెంకటాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే టిడిపి లక్ష్యమని తెలిపారు. తనను ఆదర్శిస్తే నియోజక వర్గ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి అన్ని విధాల మేలు జరుగుతుందన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, ఐటీడీపీ ఉపాధ్యక్షుడు మారెళ్ళ వెంకటేశ్వర్లు, నాయకులు మూర్తియ్య, సుబ్బయ్య, పిచ్చయ్య పాల్గొన్నారు.

➡️