హైదరాబాద్ : విజయవాడ కేంద్రంగా గత 35 ఏళ్లగా వైవిధ్యమైన వంటకాలతో భోజన ప్రియులను ఆకట్టుకుంటున్న గోల్డెన్ పెవిలియన్ సంస్థ తాజాగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో తమ శాఖను ప్రారంభించింది. ఆంధ్రా స్టైల్ బిర్యానీ, హలీమ్లకు మా సంస్థ ప్రసిద్ధి. బంజారాహిల్స్లో గోల్డెన్ పెవిలియన్ను గ్రాండ్గా ఆవిష్కరించడం వంటల వారసత్వానికి సంబంధించిన వేడుక, అసమానమైన భోజన అనుభవాలను అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. ఇది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు. ఇది ఆంధ్రా వంటకాలు కాలానుగుణమైన ఆకర్షణకు నిదర్శనం.” అని గోల్డెన్ పెవిలియన్ మేనేజింగ్ డైరెక్టర్ సాజిద్ మహ్మద్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమకు 80 రెస్టారెంట్లు ఉన్నాయన్నారు.