అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం : మంత్రి వేణు

Mar 9,2024 14:39 #East Godavari
Development and welfare is the government's mission Minister Venu

ప్రజాశక్తి-కడియం : అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ  పేర్కొన్నారు. మండలంలోని వేమగిరి గట్టు, జక్కంపూడి నగర్ ప్రాంతాల్లో శనివారం మంత్రి వేణు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి   రు.87.44 లక్షల రూపాయలతో  చేపట్టి పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసారు.  ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ, గట్టు ప్రాంతంలో 24 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు నూతన అంగన్వాడీ భవనాలు, అలాగే సుమారు 40.5 లక్షలతో చేపట్టినత్రాగునీరు lపైపులైన్, మరియు కుళాయిలను ప్రారంభించారు. అనంతరం జక్కంపూడి నగర్ లో సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన రైతు భరోసా కేంద్రంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గిరజాల బాబు, వై.స్టాలిన్, ఎంపీడీవో రాజ్ మనోజ్, పంచాయతీరాజ్ ఏఈ త్రిమూర్తులు, ఆర్ డబ్ల్యూ ఎస్ డిఈ శ్రీనివాస్ స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

➡️