చీరాల ఘటనకు సిపిఐ ఖండన

ప్రకాశం జిల్లా చీరాలలో టిడిపి, వామపక్షాలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఆయన సోదరులు, అనుచరగణం దాడి చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముందస్తు అనుమతి తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన బహిరంగసభపై ఎమ్మెల్యే అనుయాయులు దాడి చేస్తుంటే పోలీసులు గుడ్లప్పగించి చూశారని విమర్శించారు. సభలో ఉన్న వారిపై కారంచల్లి, కుర్చీలను విసిరేస్తుంటే పోలీసులు నిస్సహాయస్థితిలో ఉండిపోయారని తెలిపారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఆయన సోదరులు స్వాములు, ఇతర అనుచరగణాన్నీ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి, జైలుకు పంపితేనే హోం శాఖపై, సిఎంపై ప్రజలకు విశ్వసనీయత ఉంటుందని పేర్కొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్