ఐసిసి హాల్‌ఆఫ్‌ ఫేమ్‌లో కపిల్‌

హర్యానా హరికేన్‌గా ప్రసిద్ధి చెందిన భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, 1983లో భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన కపిల్‌దేవ్‌ నిఖాంజ్‌ అంతర్జా తీయ క్రికెట్‌ మండలి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఐసిసి అధ్యక్షుడు డేవిడ్‌ మోర్గాన్‌ అనేకమంది ఆహుతుల సమ క్షంలో కపిల్‌దేవ్‌కు స్మారక క్యాప్‌ను ప్రదానం చేసారు. తనకు ఈ గౌరవం లభించడం గర్వంగా భావిస్తున్నానని కపిల్‌దేవ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అనేకమంది ఘనచరిత్ర గల వారి సరసన తన స్థానం లభించడం ముదావహమని పేర్కొన్నాడు. సునీల్‌ గవాస్కర్‌ తన ఆరాధ్య క్రికెటర్‌ అని, క్లయివ్‌ లాయిడ్‌, రిచర్డ్‌ హాడ్లీ, వసీం అక్రం సరసన తనకు చోటు దక్కడం నిజంగా అద్భుతమని వ్యాఖ్యానించాడు. 1959 జనవరి 6న ఛండీఘర్‌లో జన్మించిన కపిల్‌ దేవ్‌ 131 టెస్టులు, 225 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 16 సంవత్సరాలపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగాడు. 1978లో పాకిస్తాన్‌లోని క్వెట్టాలో అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించాడు. 1994లో టెస్టుల్లో 434 వికెట్లు తీసుకుని రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో కపిల్‌ నెలకొల్పిన రికార్డును వెస్టిండీస్‌ పేసర్‌ వాల్ష్‌ బ్రేక్‌ చేసాడు. 1988లో విండీస్‌ స్పీడ్‌స్టర్‌ పేరున ఉన్న వన్డేల్లో అత్యధిక వికెట్ల రికార్డు(252)ను బ్రేక్‌ చేసాడు. 1994లో ఈ రికార్డును వసీం అక్రం బ్రేక్‌ చేసాడు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్