గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో పదో తరగతి ఫలితాలు పెరిగాయి. ఇందులోనూ బాలికలే ముందువరసలో నిలిచారు. విద్యార్థులు గత మార్చిలో జరిగిన పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరానికి 83.04 శాతం ఫలితాలు సాధించారు. గతేడాదితో పోలిస్తే 8.22 శాతం ఉత్తీర్ణత అధికమైంది. ఈ ఏడాది టెన్త్ ఫలితాల శాతం పెరగడంలో జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి శ్రమ కనిపిస్తోంది. నిరంతర సమీక్షలు, విద్యాశాఖ పర్యవేక్షణలో కనబర్చిన శ్రద్ధ ఫలితాలు అధికం కావడానికి కారణమని విద్యాశాఖ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి.

గత మూడేళ్ల ఫలితాలు పరిశీలిస్తే ఎప్పుడూ రానివిధంగా ఆశ్చర్యకరంగా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 20వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది దాదాపు 77,250 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 64,151 మంది పాసయ్యారు. ఇందులో బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. 40, 312 మంది బాలురు పరీక్ష రాయగా, 33,362 మంది ఉత్తీర్ణత సాధించి 81.75 శాతం మేర ఫలితాలు సాధించారు. 36,438 మంది బాలికలకు గానూ 30,789 మంది పాసయి 84.50 శాతం ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లా సగటు కంటే బాలికల ఉత్తీర్ణతా శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది '0' శాతం ఫలితాలు ఎక్కడా రాలేదు. దాదాపు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. కాగా గ్రేడుల కేటాయింపుతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆతృతతోపాటు ఆందోళన విద్యార్థుల్లో కనిపించింది. ఫలితాలు పెరగడం పట్ల డిఇఓ సోమిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇది విద్యాశాఖ పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఫలితాల సాధనకు కృషిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఆన్సర్షీట్ల రీ-వెరిఫికేషన్ కమ్ ఆన్సర్ షీట్ల ఫోటో కాపీల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 15 రోజుల్లో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున ప్రభుత్వ ఖాతాకు చలానా ద్వారా చెల్లించాలని కోరారు.
జూన్ 20న సప్లమెంటరీ పరీక్షలు
పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన వారికి జూన్ 20 నుంచి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరులోగా పాఠశాలల యజమాన్యాలకు విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, యజమాన్యాలు జూన్ 12న బ్యాంకులు, ట్రెజరీల్లో చెల్లించాలని సూచించారు. ఫీజులు కంప్యూటర్ ప్రతులను జూన్ 13న ప్రధానోపాధ్యాయులు తమ కార్యాలయంలో సమర్పించాలని డిఇఓ సోమిరెడ్డి చెప్పారు.
గ్రేడులతో గందరగోళం
పదో తరగతి ఫలితాలు గ్రేడుల ద్వారా కేటాయించడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఇంతకుముందులా మార్కుల ప్రాతిపదికన కాకుండా పాయింట్ల ఆధారంగా ఫలితాలు విడుదల చేయడంతో కొంత ఇబ్బంది పడ్డారు. జిల్లాలో ఎంత మంది ఉత్తీర్ణులయ్యారు, ఎంత మంది ఫెయిల్ అయ్యారనే సంగతి గ్రేడుల ద్వారా విద్యాశాఖ అందించలేకపోయింది. దీనిపై గురువారం సాయంత్రం వరకు కసరత్తు చేసినా ఫలితం లేకపోయింది. ఉత్తీర్ణత సాధించిన వారికి ఎ1, ఎ2, బి1,బ2, సి1,సి2, డి1,డి2, గ్రేడులు కేటాయించారు.
java.lang.NullPointerException