రుణాలు సక్రమంగా చెల్లించాలి

గ్రామ సంఘాలు తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించి సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని ఎపిఎం పద్మ అన్నారు. మండలంలోని బిక్కనూర్‌ గ్రామంలో బుధవారం గ్రామసంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఎం మాట్లాడుతూ అర్హత పొందిన సంఘాలకు రుణాలు అందజేస్తామన్నారు. రుణాలు చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ఉన్న నిరుద్యోగులను గుర్తించాలని ఆమె పేర్కొన్నారు. సంఘాలలో లేని వారిని కొత్త సంఘాల్లో చేర్చుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచి సాయాగౌడ్‌, ఐకెపిసిబ్బంది రవి, గ్రామసంఘం మహిళా అధ్యక్షురాలు వినోద, మహిళలు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్