ఏవీఎం. ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.శరవణన్, ఎం.ఎస్. గుహన్, అపర్ణ గుహన్ నిర్మించిన 'లీడర్' చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేస్తున్నట్లు 'ఠాగూర్' నిర్మాత మధు వెల్లడించారు. గతంలో పలు తమిళ చిత్రాలను ఆయన తెలుగులో అనువదించారు. ప్రస్తుతం లీడర్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు ప్రకటించారు. డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉన్నా రాష్ట్ర పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. కాలేజీలు, ఐటీ, కార్పొరేట్ కంపెనీల్లో లీడర్ అంటే ఉండాలి? అనే విషయంపై దర్శకుడు శేఖర్ కమ్ముల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఈ చిత్రానికి సంగీతం మిక్కీజేమేయర్.