తమిళంలో మోసర్బీర్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన 'పూ' అనే చిత్రాన్ని తెలుగులో 'మల్లి వెర్సస్ రవితేజ'గా ఆర్.సత్యనారాయణ అనువదిస్తున్నారు. డబ్బింగ్ జరుపుకుంటోంది. పాటల రికార్డింగ్ గురువారం ప్రారంభమైంది. ఇందులో ఐదు పాటలను వనమాలి రాశారు. చిత్రం గురించి నిర్మాత తెలుపుతూ...'ఇదొక అందమైన ప్రేమ కథా చిత్రం. నేటి తరం మెచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి. కథానాయిక మల్లి, హీరో రవితేజ పాత్రల చుట్టూ యీ కథ సాగుతుంది. వారి ప్రేమ ఏమవుతుంది? అనేది దర్శకుడు శశి ఆసక్తికరంగా తెరకెక్కించారు. రవితేజగా శ్రీరామ్, మల్లి పాత్రలో పార్వతీమీనన్ అద్వితీయంగా నటించారు. ఈనెలాఖరున ఆడియోను, సెప్టెంబర్లో సినిమాను విడుదల చేయనున్నా'మని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఎస్. కుమరన్, కెమెరా: పిజి. ముత్తయ్య.