ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సురేందర్‌

    ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా తిరుమలగిరి సురేందర్‌ గురువారంనాడు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని అకాడమీ కార్యాలయంలో మాజీ ఛైర్మన్‌ దేవులపల్లి అమర్‌ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ పాత్రికేయులు సురేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి గీతారెడ్డి, కమిషనర్‌ పార్థసారధి తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విలేకరులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్