నాలుగు దశాబ్దాలుగా ప్రతి ఏటా ఉత్తమ వచన కవిత్వ గ్రంథాన్ని ఎంపిక చేస్తున్న ఫ్రీ వర్స్ ఫ్రంట్ 2008 సంవత్సరానికి గాను చింతా అప్పలనాయిడు రాసిన 'దుక్కి' గ్రంథానికి, 2009 సంవత్సరానికి యాకూబ్ రాసిన 'ఎడతెగని ప్రయాణం' గ్రంథానికి బహుమతులను ప్రకటించింది. ఈ బహుమతి కింద ఒక్కొక్కరికి పదివేలు నగదుతో పాటు సంస్థ చిహ్నమైన మెమోంటోను అందజేస్తారు. త్వరలో హైదరాబాద్లో ఏర్పాటు చేసే బహుమతి ప్రదాన కార్యక్రమంలో వీటిని అందజేస్తారని శీలా వీర్రాజు పేర్కొన్నారు. వర్థమాన సమస్యల నేపథ్యంలో రైతన్న ఎదుర్కొంటున్న దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టిన ట్టు 'దుక్కి'లో రచయిత చూపారు. అదేవిధంగా ఆత్మీయానుబంధాలు, స్నేహసౌజన్యాలు మనిషి జీవితం నుంచి కనుమరుగై పోతున్న ఆధునిక సమాజంలో వాటి కోసం తపించే వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో 'ఎడతెగని ప్రయాణం'లో కవి చక్కగా వర్ణించారు.
ఇల్లు ఒక్కటే.. పన్నులు అనేకం
సీరియల్ కిల్లర్ అరెస్ట్
మైనర్పై అత్యాచారానికి పాల్పడిన... ఇన్స్పెక్టర్పై కఠిన చర్యలు
5న తెలంగాణ బంద్
ప్రముఖులకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు
గణేష్ విగ్రహల ప్రతిష్టకు నిబంధనలు పాటించాలి
కళ్లకు గంతలు కట్టుకుని ఎపిఐఇఆర్టిఎఫ్ వినూత్న నిరసన
గ్రూప్1 పరీక్ష వాయిదా వేయాలి : ఎపిటిఎఫ్
రెండో రోజూ జూనియర్ డాక్టర్ల ధర్నా