ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ల కల్పనపై వస్తున్న సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు పిసిసి ఒక కమిటీ నియమించింది. పిసిసి బుధవారం ఈ మేరకు సభ్యుల వివరాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. పార్లమెంటు సభ్యులు ఎంఏ ఖాన్, మాజీ మంత్రి ఫరీదుద్దిన్, ఎమ్మెల్యే మస్తాన్ వలి, ఎమ్మెల్యే షాజహాన్, పారూఖ్ హుస్సేన్, మిర్ హది అలీ ఉన్నారు.