4 కోతులను వండుకొని తిన్నారు..! గ్రామస్తులు చితకబాదారు..!

Dec 13,2023 12:42 #4, #cooked, #crushed, #eaten, #monkeys, #Villagers

భైంసా (నిర్మల్‌) : 4 కోతులను వండుకొని తిన్న కొందరిని గ్రామస్తులంతా చితకబాదిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని చింతలబోరి గ్రామంలో కొందరు వ్యక్తులు కోతులను చంపి తినడం కలకలం రేపింది. నాలుగు కోతులను పట్టుకొని చంపి వండుకుని తిన్నవారిని గ్రామస్థులంతా చితకబాదారు. వీరు సంచార జాతులకు చెందినవారని అనుమానిస్తున్నారు. కోతులను తాము దైవంతో సమానంగా పూజిస్తామని, వాటిని చంపితినడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ శివారులోని వారి గుడారాల వద్దకు వెళ్లి గొడవకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు గ్రామస్తులు తెలిపారు.

➡️