12 కేజీల గంజాయి స్వాధీనంప్రజాశక్తి-తిరుపతి(మంగళం):తిరుపతి జిల్లా ఎస్పీ కష్ణకాంత్ పటేల్, సబ్ అదనపు ఎస్పీ రాజేంద్ర ఆదేశాలతో తిరుపతి రూరల్ సెబ్ సీఐ భీమలింగ రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద జరిపిన సోదాల్లో తమిళనాడు కడలూరు జిల్లాకు చెందిన శివ ప్రకాశం అనే వ్యక్తి వద్ద 12 కేజీల గంజాయిని గుర్తించి అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారని సెబ్ అధికారులు తెలిపారు. శివ ప్రకాశంను విచారించగా సదరు గంజాయిని ఒరిస్సా రాష్ట్రంకు చెందిన జితేందర్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నాడని, గంజాయి రవాణాతో సంబంధం కలిగిన తమిళనాడు కన్యాకుమారి ప్రాంతాలకు చెందిన రాజేష్ పై కేసు నమోదు చేశామన్నారు. పట్టుబడిన శివ ప్రకాశం ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ దాడులలో ఎస్సై అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రవి చిరంజీవి, కానిస్టేబుళ్లు మహేష్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.